Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు ముందు బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ ఎంపీ మలూక్ నగర్ రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)లో చేరారు. పార్టీ చీఫ్ జయంత్ చౌధరి సమక్షంలో మలూక్ నగర్ గురువారం ఢిల్లీలో ఆర్ఎల్డీలో చేరారు. తాను ఎంపీగా గెలుపొందడంలో ఆర్ఎల్డీ, ఎస్పీ, బీఎస్పీ కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
తన గెలుపులో జయంత్ కూడా ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన భారీ సభలు నిర్వహించారని గుర్తుచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మలూక్ నగర్ బీఎస్పీ టికెట్పై ఎంపీగా విజయం సాధించారు.
అప్పట్లో బీఎస్పీ ఆర్ఎల్డీ, ఎస్పీలతో జట్టు కట్టింది. ఎంపీగా తాను పార్లమెంట్లో ఎన్నో అంశాలను లేవనెత్తానని, పాలక పార్టీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టానని ఆర్ఎల్డీలో చేరిన అనంతరం మలూక్ నగర్ పేర్కొన్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ఎంపీ మలూక్ నగర్ పార్టీని వీడటం బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Read More :
SS Rajamouli | ప్రభుదేవా పాటకు రాజమౌళి స్టెప్పులు.. రిహార్సల్స్ వీడియో చూశారా.!