Loksabha Elections 2024 : బీఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం మాయావతి ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆదివారం ముజఫర్నగర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు అద్దం పడుతూ పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. బీఎస్పీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు, కార్మికులు, రైతులు, చిరు వ్యాపారుల అవసరాలను గుర్తించి సేవలు అందించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపుతుందని ఆమె పేర్కొన్నారు.
మీరు కోరుకుంటే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఈ దిశగా తాము గట్టి చర్యలు చేపడతామని మాయావతి హామీ ఇచ్చారు. ఇక ముజఫర్నగర్ అభ్యర్ధిగా దారా సింగ్ ప్రజాపతిని బీఎస్పీ ఎన్నికల బరిలో నిలిపింది.
Read More :