PM Modi : కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నిప్పుతో చెలగాటమాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ వాడుతున్న భాష ఇలాగే ఉందని అన్నారు. దేశాన్ని విభజించి, చీల్చి బలహీనపరచాలని కాంగ్రెస్ ఇప్పటికీ యోచిస్తోందని దుయ్యబట్టారు.
మైసూర్లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ సనాతన ధర్మాన్ని అంతమొందించాలని కోరుకుంటోందని అన్నారు.
హిందూ మతంలో శక్తిని నిర్వీర్యం చేయాలని వారు కోరుకుంటున్నారని, కానీ మోదీ ఉన్నంతవరకూ ఈ విద్వేష శక్తులు ఎన్నడూ తమ ప్రయత్నాల్లో సఫలం కాబోవని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు కేవలం రాబోయే ఐదేండ్లకు పాలకులను నిర్ధారించేవి కావని 2027 నాటికి వికసిత్ భారత్గా ఆవిర్భవించేందుకు దిశానిర్ధేశం చేస్తాయని చెప్పారు.
Read More :
Tollywood | చిరంజీవిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్.. స్పెషల్ ఏంటో తెలుసా..?