న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపత్నిగా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటు అని బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. అధిర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని మాయావతి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాయావతి ట్వీట్ చేశారు. ఓ గిరిజన తెగ నుంచి భారతదేశ అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం చాలా మందికి నచ్చలేదు. ముర్ముపై అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు చాలా విచారకరం. ఆయన వ్యాఖ్యలు అత్యంత ఖండించదగినవి అని మాయావతి తన ట్వీట్లో పేర్కొన్నారు. లోక్సభలో అధిర్ అలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
1. भारत के सर्वोच्च राष्ट्रपति पद पर आदिवासी समाज की पहली महिला के रूप में द्रौपदी मुर्मू जी का शानदार निर्वाचन बहुत लोगों को पसंद नहीं। इसी क्रम में लोकसभा में कांग्रेस के नेता श्री अधीर रंजन चौधरी द्वारा उनके खिलाफ आपत्तिजनक टिप्पणी करना अति-दुःखद, शर्मनाक व अति-निन्दनीय। 1/2
— Mayawati (@Mayawati) July 28, 2022