శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ చొరబాటుదారుడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ము డివిజన్లోని అరీనా సెక్టార్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున ఓ పాకిస్థానీ అక్రమంగా భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించాడు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళాలు (బీఎస్ఎఫ్) అతడిని లొంగిపోవాలని కోరినప్పటికీ అతడు ఆగకపోవడంతో సైనికులు కాల్పులు జరిపారు. దీంతో చొరబాటుదారుడు మృతిచెందాడని భద్రతా దళాలు ప్రకటించాయి.
కొత్త ఏడాదిలో అక్రమ చొరబాట్లకు పాల్పడటం ఇది రెండోసారి. శనివారం కుప్వారా ప్రాంతంలో పాక్ పౌరుడు దేశంలోకి చొరడటానికి ప్రయత్నించడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది అతడిని కాల్చివేశారు. అతడిని మహమ్మద్ షబ్బీర్గా గుర్తించారు. అతనివద్ద ఏకే-47 రైఫిల్, ఏడు గ్రనేడ్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.