శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ముగ్గురు చొరబాటుదారులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కశ్మీర్లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న ముగ్గురిని సరిహద్దు భద్రతా దళం (BSF) గుర్తించింది. వారిని లొంగిపోవాలని కోరినప్పటికీ వారు పట్టించుకోలేదని, దీంతో వారిని మట్టుబెట్టామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వారి నుంచి 36 కిలోల మత్తు మందును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.