న్యూఢిల్లీ : తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎంపీ కే కేశవరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుంది. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్లో ఎండగడుతాం. అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరి స్పష్టంగా చెప్పాం అని కేకే పేర్కొన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం. అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని కేకే స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్హాల్లో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్లో ఎండగట్టాలని, అందుకు కలిసివచ్చే పార్టీలతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాల్లో గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు ఉన్నాయని కేకే పేర్కొన్నారు. దీనితోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై పార్లమెంట్లో చర్చ జరుగాలని డిమాండ్ చేశారు.
BRS & AAP have decided to boycott the President’s address to Parliament today. We are not against the President but only want to highlight through democratic protest the governance failures of the NDA govt: BRS MP K Keshava Rao pic.twitter.com/NffnCmG4HK
— ANI (@ANI) January 31, 2023