న్యూఢిల్లీ : పెండ్లికి హాజరైన అతిధులంతా ఒక్క క్షణం తాము రెజ్లింగ్ మ్యాచ్ చూసేందుకు వచ్చామా అనే డైలమాలో పడిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పెండ్లి మంటపంలో వధూవరులు ఓ రేంజ్లో ఫైట్ చేసుకున్న వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో స్టేజ్పైనే వధూవరులు ఒకరిని ఒకరు తోసుకుంటూ పిడిగుద్దులతో రెచ్చిపోయారు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022
ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని చిన్న పిల్లల్లా కుస్తీ పట్టడంతో అతిధులు అవాక్కయ్యారు. క్లిప్ ఆరంభంలో వధువుకు పెండ్లి కొడుకు స్వీట్ తినిపించడం కనిపించింది. ఆపై స్వీట్స్ వద్ద పెండ్లి కూతురుకు సమస్య రావడంతో గొడవ మొదలైనట్టు కనిపించింది. ఆమె బలవంతంగా వరుడి చేతిని తొలగించడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా లైవ్ రెజ్లింగ్ మ్యాచ్లా మారింది.
ఇద్దరూ బాహాబాహీకి దిగడంతో అతిధులంతా వేదికపైకి వచ్చి వారికి నచ్చచెప్పడం కనిపించింది. ఈ వైరల్ క్లిప్ను ఘర్కెకలేష్ అనే యూజర్ ట్వి్ట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 1.6 లక్షల మందికి పైగా వీక్షంచారు. వీరు అసలు పెండ్లి చేసుకున్నారా..విడాకులు తీసుకుంటున్నారా అని ఓ యూజర్ సందేహం వ్యక్తం చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారా అని మరో యూజర్ ప్రశ్నించారు. పూర్తి మ్యాచ్ను తాను ఎక్కడ చూడాలని మరో యూజర్ అడిగారు. అయితే ఈ వీడియో జరిగిన ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసినదని పలువురు సందేహం వ్యక్తం చేశారు.