ముంబై: ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, ప్రముఖ మంత్రుల పాత్ర ఉన్నదని పేర్కొన్నారు.
ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి రాజీనామా చేసి కుంభకోణంపై ప్రకటన చేయకుంటే ఒక దాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తామన్నారు. దీంతో పోలీసులు తనిఖీ దళాలతో సోదాలు చేశారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.