బెంగళూరు: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం స్వదేశానికి చేరుకున్నది. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్ మృతదేహం బెంగళూరుకు చేరుకున్నది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతున్న నవీన్.. మార్చి 1న ఖార్కీవ్లో జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అతని మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు.
బెంగళూరు విమానాశ్రయంలో నవీన్ పార్థివదేహానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు. నవీన్కు అంతమ సంస్కారాలు నిర్వహించేందుకు వీలుగా అతని భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బాండు దాడిలో అతను ప్రాణాలు కోల్పోవడం తనను బాధించిందని సీఎం చెప్పారు.