తిరువనంతపురం : కేరళలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సరదాగా మొదలైన బోట్ రేస్ విషాదాన్ని మిగిల్చింది. పడవల పోటీలో 25 మంది మహిళలను ఎక్కించుకుని వెళుతున్న ఓ పడవ నీట మునగడంతో మహిళల ఆచూకీ గల్లంతైంది.
పడవ బోల్తా పడటంతో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇతర బోట్ రేసులన్నింటినీ నిలిపివేశారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి సహాయ కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. పడవలో ప్రయాణిస్తున్న మహిళల క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
గాలింపు చర్యలను ముమ్మరంగా చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. కేరళలోని అలప్పుజలో ఈ ఘటన జరిగింది.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
Read More :