దిస్పూర్ : అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తాపడింది. సంఘటన జరిగిన సమయంలో ఆ పడవలో దాదాపు వంద మంది వరకు ఉన్నారు. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు పడవలో ఉన్న వారిని రక్షించారు. పడవ బాషానీకి వెళ్తుండగా అడబరి వద్ద బ్రిడ్జి పోస్ట్ను ఢీకొట్టింది. ఓ ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. పది మోటార్ సైకిళ్లను సైతం ఎక్కించారని, ఇదే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.
బోటులో పలువురు పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారని, ఇప్పటివరకు ఎవరి జాడ తెలియలేదని ఆయన చెప్పారు. ధుబ్రి సర్కిల్ అధికారి సంజు దాస్ భూమి డాక్యుమెంట్స్ అధికారితో పాటు కార్యాలయ ఉద్యోగి సైతం పడవలో ఉన్నారని, కొంత ప్రాంతంలో సర్వే చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. మరో ఇద్దరు వ్యక్తులు ఈదుకుని సురక్షితంగా బయటికి వచ్చినప్పటికీ దాస్ జాడ తెలియలేదని తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎస్డీఆర్ఎఫ్కు చెందిన గజ ఈతగాళ్ల సహాయం తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
#WATCH असम के धुबरी में ब्रह्मपुत्र नदी में नाव पलटी, सर्कल अधिकारी समेत 7 लोग लापता; देखें VIDEO#Assam #brahmaputrariver pic.twitter.com/LdUQUHyz93
— Hindustan (@Live_Hindustan) September 29, 2022