ముంబై : మహారాష్ట్రతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో నగరంలోని జుహు బీచ్ మూసివేత దిశగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. సిటీలోని అంధేరి వెస్ట్ ప్రాంతం కరోనా హాట్స్పాట్గా మారడంతో అప్రమత్తమైన అధికారులు జుహు బీచ్ మూసివేసేందుకు మొగ్గుచూపే అవకాశం ఉంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఈ బీచ్కు సందర్శకులు పోటెత్తడంతో బీచ్లోకి ప్రజలను అనుమతించరాదని బీఎంసీ వర్గాలు యోచిస్తున్నాయి.
జుహు బీచ్లో మాస్క్లు ధరించని వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నామని, బీచ్ ప్రాంగణంలోని భేల్ ప్లాజా వద్ద యాంటీజెన్ పరీక్షలు చేపట్టామని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విశ్వాస్ మోతే తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మాల్స్, జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలు, రైల్వే స్టేషన్లలో పెద్ద ఎత్తున రాండమ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక ముంబైలో మంగళవారం ఏకంగా 3512 తాజా కొవిడ్ కేసులు వెలుగుచూడటంతో ఆందోళన నెలకొంది.