డెహ్రాడూన్: ఒక పులి మనుషులపై దాడులు చేస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగింది. దీంతో జనం భయపడి ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు ఆ పులిని కాల్చి చంపారు. (Tiger Shot Dead) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మలేత గ్రామంలో ఒక పులి సంచరిస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగిన అది ఇప్పటి వరకు పది మందిపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
కాగా, గ్రామస్తులతోపాటు దేవప్రయాగ్ ఎమ్మెల్యే వినోద్ కందారి ఈ అంశంపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల్లో పులి భయం పోగొట్టాలని కోరారు. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులిని పట్టుకోవడం లేదా చంపడం కోసం బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ సహాయంతో ఆ పులిని గుర్తించారు. దానిని చుట్టుముట్టారు. మనుషులకు ప్రమాదకరంగా మారిన ఆ పులిపై కాల్పులు జరిపారు. దీంతో అది మరణించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
देखिए टाइगर को ढेर करने का लाइव वीडियो,
दहशत बने टाइगर को आज घेराबंदी करके ढेर कर दिया। मामला टिहरी जनपद के मलेथा गाँव का है, पिछले दो दिन में दस लोगो को घायल कर चुके इस गुलदार की घेराबंदी के लिए ड्रोन का प्रयोग किया गया।
वन विभाग के इस पूरे ऑपरेशन में देवप्रयाग के विधायक विनोद… pic.twitter.com/cUNJkgjqQj— Ajit Singh Rathi (@AjitSinghRathi) February 23, 2024