రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. జేసీబీ వాహనం టైర్లోకి గాలి నింపుతుండగా అది క్షణాల్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటన మే 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. ఓ వ్యక్తి టైర్లో గాలి నింపుతుండగా, మరో వ్యక్తి వచ్చి ఆ టైర్ను పలుమార్లు ప్రెస్ చేస్తుండగా పేలిపోయింది. దీంతో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వర్కర్లను మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
#CCTV, Blast occurred while filling air in JCB tire in #Raipur, 2 people died. pic.twitter.com/3TtmMlZXQD
— Nikhil Choudhary (@NikhilCh_) May 4, 2022