నోయిడా, మే 31: సిరా దాడులు, భౌతిక దాడులు రైతుల గొంతును నొక్కలేవని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. సోమవారం బెంగళూరులో తనపై జరిగిన సిరా దాడిపై ఆయన స్పందించారు. ‘ఇలాంటి దాడులకు భయపడేవాళ్లం కాదు. ఇలాంటి దాడులు రైతులు, దళిత, గిరిజన, బహుజన, కార్మికుల గొంతును నొక్కలేవు. ఎంత నొక్కేయాలని చూస్తే అంత గట్టిగా ఎగిసిపడుతాం. చివరి శ్వాస వరకూ పోరాడుతాం’ అని హెచ్చరించారు.