ముజఫర్నగర్, ఏప్రిల్ 15: పదేండ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపికి మద్దతు ఇచ్చి భంగపడ్డామని బీకేయూ నేత నరేశ్ టి కాయిత్ విచారం వ్యక్తం చేశారు. నాలుగేండ్ల క్రి తం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమం లో 750 మంది కర్షకుల బలిదానాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేద ని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ సర్కారుది నియంతృత్వ ధోరణి అని మండిపడ్డా రు. యూపీలోని సిసౌలీలో సోమవారం ఆ యన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇ చ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎ న్నికల్లో ఏ పార్టీకి మద్దుతు ఇవ్వాలన్న దానిపై ఈ నెల 17న యూపీలోని సిసౌలీలో నిర్వహించే మహా పంచాయత్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘మాది పెద్ద సంఘం.
ప్రతి సభ్యుడు ఏదో ఒక పార్టీతో సంబంధం కలిగి ఉంటారు. కొందరు ఎన్నికల అభ్యర్థులతో బంధుత్వం కలిగి ఉంటారు లేదా వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి ఉమ్మడిగా ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో మేం నిర్ణయం తీసుకోలేకపో యాం’ అని టికాయిత్ అన్నారు. బీజేపీకి ఆర్ఎల్డీ మద్దతు ఇవ్వడం తమను దిగ్భ్రాంతికి గు రి చేసిందన్నారు. అయితే ఆర్ఎల్డీని తమ సం ఘం వ్యతిరేకించదని..ఆ మాటకొస్తే తాము ఎవరినీ వ్యతిరేకించమని చెప్పారు.
బీజేపీ మ్యానిఫెస్టో రైతు వ్యతిరేకం
బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో దేశ రైతాంగానికి, రైతు కూలీలకు వ్యతిరేకమని, పంటలకు కనీస మద్దతు ధర అమలు ప్రస్తావనే ఆ పార్టీ ఎన్నికల హామీలో లేదని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తం చేసిం ది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రస్తావన లేని బీజేపీ మ్యానిఫెస్టో.. రైతులు, రైతు కూలీలకు వ్యతిరేకంగా విసిరిన బహిరంగ సవాల్గా ఎస్కేఎం అభిప్రాయపడింది.