రాయ్పూర్, అక్టోబర్ 9: ఛత్తీస్గఢ్ ఓటర్లు 2018లో మార్పును కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం అమలుజేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రమణ్సింగ్ నేతృత్వంలో 15 ఏండ్ల బీజేపీ పాలనకు ప్రజలు ముగింపు పలికారు. బీజేపీ హయాంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందన్న ప్రచారం కాంగ్రెస్కు కలిసివచ్చింది. అయితే వాగ్దానాలు, సంక్షేమం, అభివృద్ధి మరచిన కాంగ్రెస్ సర్కారు.. అంతర్గత కుమ్ములాటలతో ముగినిపోయింది.
గోసంరక్షణ, ఆవుపేడ కొనుగోలు, శ్రీరాముడి విగ్రహాల ప్రతిష్టాపన.. మొదలైన హిందూత్వ అంశాలను కాంగ్రెస్ నెత్తికెత్తుకుంది.
మద్యం అమ్మకాల్లో అక్రమాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో అవకతవకలు, మత ఘర్షణలు.. బీజేపీ ప్రచార అస్ర్తాలుగా మారాయి. అయితే బీజేపీలో నాయకత్వం లోపించింది. మాజీ సీఎం రమణ్సింగ్ చురుగ్గా లేరు. దీంతో మోదీ చరిష్మాపైనే బీజేపీ భారం వేసింది.
విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్.. ఇక్కడ ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. ఆప్ ఇప్పటికే 22చోట్ల తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. బీఎస్పీ, గొండ్వానా గణతంత్ర పార్టీతో చేతులు కలిపింది. ఈసారి ఎన్నికల్లో ఆప్ ప్రభావం నిపుణులు అంచనా
వేస్తున్నారు.