భువనేశ్వర్, మార్చి 8: రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీది ఒంటరి పోరేనని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ సమాల్ తేల్చి చెప్పారు. అధికార బీజేడీతో పొత్తుపై పార్టీ అధినాయకత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆయన స్పష్టంచేశారు.
2009లో సీట్ల పంపకాల విషయంలో విభేదాలతో బీజేపీతో బీజేడీ విడిపోయింది. ఇటీవల బీజేపీతో బీజేడీ పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ స్పష్టతనిచ్చారు. 2019లో ఒడిశాలో బీజేపీ 8 పార్లమెంట్, 23 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా.. బీజేడీ 12 పార్లమెంట్, 123 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది.