బెంగళూరు, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఏయే బూత్లను సెన్సిటివ్గా ప్రకటించాలి? ఏయే ప్రాంతాలకు పారా మిలిటరీ బలగాల్ని పంపాలి? ఏయే బూత్లకు వెబ్ కాస్టింగ్ వ్యవస్థ అవసరమో వెంటనే తెలపాలి. లేకపోతే జాబితాలో మీ సిఫారసులను చేర్చటం కష్టం’ అని ఏకంగా కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజె తమ పార్టీ శ్రేణులకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది.
ఎన్నికల నిర్వహణపై బీజేపీ పెత్తనం చేసేందుకు, అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నదని దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.