సిమ్లా, డిసెంబర్ 8: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లో బీజేపీకి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఐదేండ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే 37 ఏండ్ల సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి.. కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగించారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 40 స్థానాలు చేజిక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. హిమాచల్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమ్ఆద్మీ పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. 67 సీట్లలో పోటీచేసినా ఒక్క చోట కూడా గెలువలేదు. 3 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని హిమాచల్ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటంతో తన పదవికి రాజీనామా చే శారు. రాజీనామా లేఖను గవర్నర్ రా జేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు పంపించారు.