రాంచీ, ఏప్రిల్ 11: జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్కు చేపట్టిన మార్చ్ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
తమపై దాడి చేసే చర్యలకు దిగారని, దీంతో వారిని చెదరగొట్టేందుకు టియర్గ్యాస్, వాటర్ కెనాన్లు వాడామని పోలీసులు తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ, బీజేపీ ర్యాలీ నిర్వహించతలబెట్టిందని వెల్లడించారు.