గదగ్, మే 1: చిరువ్యాపారి నుంచి కూల్డ్రింక్లను ఎత్తుకుపోయి తాగారు బీజేపీ కార్యకర్తలు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. గదగ్ జిల్లాలోని లకే్ష్మశ్వర్లో ఏప్రిల్ 28న హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహించారు. ఆ సభ వద్ద కూల్డ్రింక్లు విక్రయించేందుకు తన వాహనం తీసుకుని సమీర్ హసన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చారు.
కూల్డ్రింక్లను చూసిన బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడి వాహనాన్ని లూటీ చేశారు. తాను అమ్మేందుకు తెచ్చానని సమీర్ ఎంత వారిస్తున్నా వారు పట్టించుకోలేదు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. చివరికి పరువు పోతుందని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ బాధితుడికి 35,000 రూపాయలు ఇచ్చారు.