హజారీబాగ్, ఏప్రిల్ 4: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జార్ఖండ్ను వెనుకబాటుకు గురిచేస్తుందని మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ ఆరోపించారు. హజారీబాగ్లో జేఎంఎం పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. బీజేపీకి జార్ఖండ్ అంటే అస్సలు ఇష్టముండదని, ఆ రాష్ట్ర ప్రజలను వారు అసహ్యించుకుంటారని ఆమె ఆరోపించారు.
‘వారికి మనం నచ్చం. మన ఆత్మ గౌరవం నచ్చదు. మన పిల్లలు విదేశాలు వెళ్లి చదువుకోవడం నచ్చదు’ అని ఆమె విమర్శించారు. అలాంటి బీజేపీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.