భువనేశ్వర్, మార్చి 22: ఒడిశా లో బీజేపీ, బీజేడీ పొత్తుపై సస్పెన్స్కు తెరపడింది. ఈ లోక్సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఎం నవీన్ పట్నాయక్ నే తృత్వంలోని అధికార బీజేడీతో పొ త్తుపై గత కొన్ని రోజులుగా చర్చలు జరిగినట్టు ఆయన చెప్పారు.
అయితే అవి ఫలవంతం కాలేదన్నారు. ఈ క్ర మంలో ఒడిశాలో త్వరలో జరగబో యే 21 లోక్సభ, 147 అసెంబ్లీ సీ ట్లలో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని చెప్పారు. బీజేపీ, బీజేడీ 19 98 నుంచి 2009 వరకు ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.