న్యూఢిల్లీ, మార్చి 5: వచ్చే లోక్సభ ఎ న్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 378 స్థానాల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 335 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొన్నది.
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి కేవలం 98 స్థానాల్లో మాత్రమే గెలవగలుగుతుందని, అందులోనూ హస్తం పార్టీ అయితే 2019 కంటే మరింత దిగజారి, ఈ సారి 37 స్థానాలకు(2019లో 52) మాత్రమే పరిమితం అవుతుందని ఒపీనియన్ పోల్లో అంచనా వేసింది. రెండు కూటముల్లో లేని పార్టీలు 67 సీట్లు గెలుచుకొంటాయని పేర్కొన్నది.