న్యూఢిల్లీ: పంజాబ్(Punjab) బీజేపీ చీఫ్ సునిల్ జఖార్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్తో పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సడెన్గా ఈ ప్రకటన చేశారు. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు జూన్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏడో దశలో ఆ ఓటింగ్ జరగనున్నది. పంజాబ్ పోరులో బీజేపీ ఒంటరిగానే ఉంటుందని జఖార్ తెలిపారు. ప్రజలు, పార్టీ సభ్యుల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జఖార్ వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సాధించిన ఘనతలు ప్రజలకు తెలుసు అని, రైతుల పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు.