న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో తోటి ప్రయాణికులపై ఇతర ప్రయాణికుల మూత్ర విసర్జన సంఘటనలు ఇటీవల చర్చాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసింది. 8 ఏళ్ల కిందటి సంఘటనను దీనితో పోల్చుతూ ప్రస్తావించింది. 2015లో కన్నయ్య కుమార్ జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం నేతగా ఉన్నప్పుడు క్యాంపస్లో బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు ఒక విద్యార్థిని నాడు ఆరోపించింది. అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ తర్వాత పార్టీలో అత్యంత ఆదారణ పొందుతున్న రెండో నేత కన్నయ్య కుమార్ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ కితాబు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ను బీజేపీ నేత అమిత్ మాలవీయ లక్ష్యంగా చేసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో మూత్ర విసర్జన సంఘటనల నేపథ్యంలో ఆయనను విమర్శిస్తూ శనివారం ఒక ట్వీట్ చేశారు. ‘మనం ఇప్పుడు పీగేట్ మధ్యలో ఉన్నాం. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందుతున్న రెండో కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య కుమార్ అని జైరాం రమేష్ ప్రకటించారు. కన్నయ్య కుమార్ జేఎన్యూ క్యాంపస్లో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని మరిచిపోకూడదు. కాంగ్రెస్ శ్రేణుల్లో అలాంటి ప్రతిభ ఉంది’ అని అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. అయితే మూత్ర విసర్జన అంశాన్ని కూడా బీజేపీ నేత రాజకీయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Since we are in the middle of a #PeeGate, let’s not forget, Kanhaiya Kumar, second most popular Congress leader, after Rahul Gandhi (as declared by Jairam Ramesh), was accused of peeing in open on campus and flashing when asked not to.
The Congress has such talent in its ranks.
— Amit Malviya (@amitmalviya) January 7, 2023