PoK | దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదువిడుతల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి. పార్టీల నాయకులు తమ ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత బీజేపీపై విరుచుకుపడ్డారు. పీవోకేలో భారత్ అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని.. తిరిగి స్వాధీనం చేసుకోవాలని తాము అంటున్నామన్నారు.
కానీ, బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోందంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీవోకే గురించి పదే పదే మాట్లాడుతున్నారని.. ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 స్థానాలకుపైగా గెలుస్తామని ప్రారంభంలో చెప్పినట్లుగా ఇప్పుడు బీజేపీ చెప్పడం లేదన్నారు. పెట్రోల్ ధరలు రూ.100 దాటాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్ల ఘటనల వంటి వాస్తవ అంశాలను బీజేపీ మరుగునపడేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.