ఇండోర్: తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మీడియాలో రైతుల కష్టాలు తెలియజేసే వార్తలు రావడం లేదని, కేవలం బీజేపీ నాయకులు మాత్రమే కనబడుతున్నారని రాహుల్గాంధీ విమర్శించారు. మీడియాను బీజేపీ నాయకులు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. తాను సరైన దారిలో వెళ్తున్నందుకే తనపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
పాదయాత్ర తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, అయితే రాజకీయాల కోసం తాను భారత్ జోడో యాత్ర చేపట్టడం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అమేథీలో పోటీచేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. సచిన్ పైలట్ను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ద్రోహి అనడంపై స్పందించిన రాహుల్.. ఎవరు ఏమన్నారనే విషయంలోకి తాను వెళ్లాలనుకోవడం లేదని, ఇద్దరు నేతలూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని చెప్పారు.