Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడటం ఖాయమని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ మిషన్ 40 సీట్లను దాటడమేనని కేంద్ర మంత్రి, రాజస్ధాన్లోని బికనీర్ లోక్సభ అభ్యర్ధి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎద్దేవా చేశారు.
విపక్షం చెప్పే మాటలను తాము ఖాతరు చేయబోమని అన్నారు. ఈసారి బీజేపీ 370 స్ధానాల్లో గెలుపొందుతుందని, ఎన్డీయే 400 స్ధానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తమ మిషన్ 400 సీట్లు దాటడమైతే, రాహుల్ మిషన్ 40 స్ధానాలకు మించి గెలుపొందడమని ఆయన పేర్కొన్నారు.
బికనీర్లో తాను ఘనవిజయం సాధిస్తానని అంతకుముందు అర్జున్ రామ్ మేఘ్వాల్ ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయిలో బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, భారీ ఆధిక్యంతో తాను విజయం సాధిస్తానని చెప్పారు. మేఘ్వాల్పై కాంగ్రెస్ పార్టీ నుంచి గోవింద్ రాం మేఘ్వాల్ తలపడుతున్నారు. 15 ఏండ్ల విరామం అనంతరం మేఘ్వాల్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది.
Read More :
Kannappa | హైదరాబాద్లో అక్షయ్కుమార్.. కన్నప్ప టీం క్రేజీ అప్డేట్