కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సోమవారం భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను పలు రాష్ట్రాలు కూడా తగ్గిస్తున్నాయి. అయితే బెంగాల్లో సీఎం మమతా ప్రభుత్వం తగ్గించకపోవడంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు కోల్కతాలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ఈ సందర్భంగా మాట్లాడారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గింపు కోసం సీఎం బెనర్జీని బలవంతం చేస్తామని తెలిపారు. పోలీసులు తమను ఆపడానికి ప్రయత్నించినా ఈ అంశంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.