లక్నో: భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.
లక్నో దలిగంజ్లోని పీతాంబర దేవి ఆలయంలో జరిగిన హోమంలో పాల్గొనడానికి పూజారుల ఆహ్వానం మేరకు వెళ్లానని, ఆక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా తనకు అడ్డుపడ్డారని పేర్కొన్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే మోదీ ప్రభుత్వం కట్టడాల పేర్లు మారుస్తోందని అఖిలేశ్ విమర్శించారు.