కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేగింది. ఘోష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీఎంసీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ బెంగాల్కు స్థానిక వ్యక్తే కావాలని నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి కౌంటర్గా ‘గోవాకు వెళ్లినప్పుడు తాను గోవా బిడ్డను అని చెప్తారు. త్రిపురలో త్రిపుర బిడ్డను అంటారు. ముందు ఆమె ఎవరి కూతురు అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి’ అని ఘోష్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు.