న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం(Parliament Security Breach) ఘటనకు సంబంధించి.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ అంశం గురించి మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 13వ తేదీన జరిగిన భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. రిపోర్టు సమర్పించిన తర్వాత న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 13వ తేదీన ఇద్దరు వ్యక్తులు లోక్సభలోకి దూకి తమ వద్ద ఉన్న స్మోక్ క్యాన్లతో అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ సింహా ఆఫీసు నుంచే ఆ ఇద్దరూ విజిటర్స్ పాస్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైసూరు నియోజకవర్గం నుంచి సింహా రెండుసార్లు ఎంపికయ్యారు.