PM Modi | లక్నో, ఏప్రిల్ 17: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని, వారి కంటే గొప్ప వాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ పేర్కొన్నారు. నోయిడా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ… మోదీని, యోగిని సొంతవారిగా భావించాలని, అలా భావించనివారు తమ తల్లిదండ్రులను కూడా తమవారిగా పరిగణించరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.