న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం-1995ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ హర్నాథ్ సింగ్ యాదవ్ రాజ్యసభలో శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
బిల్లుకు అనుకూలంగా 53 మంది, వ్యతిరేకంగా 32 మంది ఓటు వేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై తర్వాత చర్చ జరుగుతుంది.