బెంగళూర్ : మహిళా దినోత్సవం రోజే బీజేపీ ఎంపీ నోరు పారేసుకున్నాడు. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలయ్యాడు. బీజేపీ ఎంపీ మునిస్వామి ఓ మహిళను బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కర్నాటకలోని కోలార్ జిల్లాలో షాపింగ్ మార్కెట్ను మునిస్వామి ప్రారంభించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడున్న స్టాల్లో మహిళను ఉద్దేశించి నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు..ఇక్కడ షాప్ పెట్టుకునేందుకు నీకు ఎవరు అనుమతించారు..నీ భర్త ఇప్పుడు బతికే ఉన్నాడుగా..అయినా బొట్టు ఎందుకు పెట్టుకోవు..నీకు కామన్సెన్స్ లేదా అంటూ నోరుపారేసుకున్నారు.
మహిళపై మునిస్వామి నోటిదురుసు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్లు మండిపడ్డారు. మహిళలపై బీజేపీ నేతలు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ భారత్ను హిందుత్వ ఇరాన్లా మార్చాలని చూస్తోందని పేర్కొన్నారు.
Read More :
Gold Smuggling: చేతులకు చుట్టుకుని గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్టు