కొచ్చి: బంగారాన్ని స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ఎయిర్ ఇండియా(Air India) ఉద్యోగిని కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. వయనాడ్కు చెందిన షఫీ అనే వ్యక్తిని కస్టమ్స్ అధికారులు(Customs Officers) అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1487 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి మధ్య ప్రయాణించే విమానంలో షఫీ బంగారాన్ని తీసుకువస్తున్నట్లు గుర్తించారు.
బంగారాన్ని చేతులకు చుట్టుకుని, దాని మీద నుంచి షర్ట్ వేసుకుని .. గ్రీన్ ఛానల్(Green Channel) ద్వారా దాటే ప్రయత్నం చేసిన షఫీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో ఘటనలో.. సింగపూర్(Singapore) నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి చెన్నై ఎయిర్పోర్టు(Chennai Airport)లో సుమారు 4 కోట్ల విలువైన ఏడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఏఐ-347, 6ఈ-52 విమానాల్లో వాళ్లను పట్టుకున్నారు.