ముంబై: రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ(Purnesh Modi) గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఇంటి పేరు బూత్వాలా(Bhootwala). ఇక గుజరాత్లో ఉన్న మోదీ కులాని(Modi community)కి చెందిన నేత ఆయన. 2019లో కర్నాటకలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. మోదీ కమ్యూనిటీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై పూర్ణేశ్ మోదీ.. క్రిమినల్ డిఫమేషన్(criminal defamation) కేసును దాఖలు చేశారు. దొంగలందరికీ మోదీ అని సర్నేమ్ ఉంటుందని రాహుల్ ఆ ర్యాలీలో అన్నారు.
అయితే కోర్టు వాదనల సమయంలో ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఫిర్యాదు చేసిన పూర్ణేశ్.. మోదీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని డిఫెన్స్ లాయర్(Defence Lawyer) తన వాదనల్లో తెలిపారు. పూర్ణేశ్ ఇంటిపేరు బూత్వాలా అని పేర్కొన్నారు. కానీ ఎమ్మెల్యే పూర్ణేశ్ తన ఇంటి పేరును మోదీగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా తెలి వర్గాని(Teli Community)కి చెందిన సుమారు 13 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ వర్గం ప్రజలకు వేర్వేరు ఇంటిపేర్లు ఉన్నాయి. రాజస్థాన్లో వాళ్లను ఘాంచిలు అంటారు. ఇక గుజరాత్లో వాళ్లనే మోదీ ఇంటిపేరుతో పిలుస్తారని ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.
తమ కులంలో చాలా మందికి.. వాళ్లు చేస్తున్న వృత్తి ఆధారంగా ఇంటిపేర్లను ఫిక్స్ చేస్తారన్నారు. లాప్సీవాలా, దాల్వాలా, చోంక్వాలా, ఖాదీవాలా తరహాలో తమకు ఇంటిపేర్లు ఉంటాయన్నారు. అయితే తమ పూర్వీకులు ఓ ప్రాంతంలో ఉన్నారని, సూరత్లో ఉన్న బూత్ సేరి(Bhoot Seri) వాడలో నివసించేవాళ్లు అని, అందుకే తమ కుటుంబీకులకు బూత్వాలా అన్న ఇంటి పేరు వచ్చినట్లు ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.
1988లో ఇంటిపేరు మార్చుకున్నారు..
సూరత్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా.. 1988లో పూర్ణేశ్ తన ఇంటిపేరును మోదీగా మార్చుకున్నారు. స్కూల్ చదువులు ముగించిన తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్ను కూడా ఆయన పొందుపరిచారు. దాంట్లో ఇంటిపేరు బూత్వాలా అని ఉంది, ఇక మోదీ ఘాంచి కులానికి చెందినట్లు రాసి ఉంది. మోదీ కులస్తుల సంచారజాతులకు చెందినవారు. గుజరాత్ ప్రాంతంలో వాళ్లు ఆయిల్ బిజినెస్ చేస్తారని తెలుస్తోంది. 1994లో వాళ్లకు ఓబీసీ గుర్తింపు వచ్చింది.
తానేమీ రాజకీయ ఉద్దేశంతో కేసును దాఖలు చేయలేదని పూర్ణేశ్ మోదీ తెలిపారు. గుజరాత్ మోదీ సమాజ్లో ఆఫీసు బియరర్గా చేశానని, కర్నాటకలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తమ సమాజం ఖండించిందని, దాని గురించి చర్చించి, ఆ తర్వాత కోర్టులో కేసు వేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోర్టు తీర్పును విజయమా లేక ఓటమా అని భావించడంలేదని, ఇది ఈ దేశ వ్యవస్థలో ఉన్న సామాజిక కోణం అని, యావత్ వర్గాన్ని దూషించడం కరెక్టు కాదన్న విషయాన్ని గ్రహించాలని పూర్ణేశ్ తెలిపారు.