ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు తీశాడు. గత ఐదేండ్లలో ఏవైనా తప్పులు చేస్తే మన్నించాలంటూ వేడుకున్నాడు. ఓ పెద్దాయనకు ఆయిల్ పూసి మసాజ్ చేశాడు. ఈ ఫీట్లన్నీ చేసింది రాబర్ట్స్గంజ్ ఎమ్మెల్యే భూపేశ్ చౌబే.