లక్నో : యూపీ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) లోకేంద్ర ప్రతాప్ సింగ్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మనం అంతరిక్షంలో కాలుమోపినా కొందరు ఇంకా చేతబడి, తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని కొందరు చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
తాను శివభక్తుడినని ఇలాంటి వాటితో తనకు ఏమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షేర్ చేసిన పోస్ట్లో ఆయన ఫొటోతో పాటు కొన్ని విత్తనాలు, నూనె, పండ్లు, కూరగాయలు కనిపించాయి. ఇలాంటి చేష్టలతో శివభక్తుడినైన తనకు ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు.
సైన్స్ చంద్రమండలానికి చేరిన ఈ రోజుల్లోనూ ఇంకా కొందరు ఇలాంటి ట్రిక్స్ను నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని మారుమూల గ్రామాలు, గిరిజన తాండాల్లో ఇప్పటికీ పలువురు చేతబడిని నమ్ముతుంటారు. ఆచార వ్యవహారాల పేరుతో వికృత క్రీడకు సంబంధించిన వార్తలు కూడా వెల్లడవుతుంటాయి.
Read More :
Afghanistan | భారత్లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం.. ప్రకటించిన అఫ్ఘానిస్థాన్