బెంగళూరు: కర్ణాటకలో 40 శాతం కమీషన్ బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించారు. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం బొమ్మై (CM Bommai) కేబినెట్లోని మంత్రులు (Ministers) ఒక్కొక్కరుగా ఓటమి చవిచూస్తున్నారు. బళ్లారి (ఎస్టీ) స్థానంలో శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర గెలుపొందారు. చిక్కబళ్లాపూర్లో మంత్రి సుధాకర్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. మరో ఆరుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అయితే సీఎం బొమ్మై షిగ్గావ్లో గెలుపొందారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 70, జేడీఎస్ 23, ఇతరులు మరో 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీజేపీ ఓటమి ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాడానికి సమాయత్తమవుతున్నది. ఆదివారం బెంగళూరులో కాంగ్రెస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సందర్భంగా పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు.