బెంగళూరు, మే 14: కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుగా ఓడింది. కమలం ఓటమిపై పలువురు అనేక కారణాలు వెల్లడిస్తున్నా, ప్రాథమికంగా ఓటర్లందరూ విద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీకి బుద్ధి చెప్పారన్నది సుస్పష్టం. మతం, కులం, దైవం ఇలా పలు అంశాల్లో విద్వేష వ్యాప్తికి తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీని ఓటర్లు తేరుకోలేని విధంగా దెబ్బతీశారని రాజకీయ మేధావులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో గెలిచిన కమలం ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను ఇలా విశ్లేషించారు…
స్పీకర్లందరూ ఇంటిదారే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. వాటిలో అసెంబ్లీలో గత ప్రభుత్వాలలో స్పీకర్లుగా వ్యవహరించిన వారెవరూ ఈ ఎన్నికల్లో గెలవకపోవటం. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి సహా మరో ముగ్గురు మాజీ స్పీకర్లు ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బీజేపీకి చెందిన కగేరి ఉత్తర కన్నడలోని సిర్సి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో 2018-19 మధ్య స్పీకర్గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్ రమేశ్ కుమార్, 2009-13 మధ్య బీజేపీ ప్రభుత్వంలో స్పీకర్గా చేసిన బీజేపీ నేత కేజీ బోపయ్య, మాజీ సీఎం, 2008-09 మధ్య యెడియూరప్ప ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన జగదీశ్ శెట్టర్ కూడా ఓటమి పాలయ్యారు. అలాగే స్పీకర్ కగేరి అందుబాటులో లేనప్పుడు సభా వ్యవహారాలు చేసిన కుమార బంగారప్ప కూడా ఈ ఎన్నికల్లో ఓడారు.