లక్నో, ఏప్రిల్ 12: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్ ఇక్కడ విజయం సాధించడం విశేషం. ఎస్పీ అభ్యర్థి ఉమేశ్ రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 36 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.