విజయపుర : గత మూడున్నరేండ్లలో అధికార బీజేపీ కర్ణాటక నుంచి రూ.1.5 లక్షల కోట్లను దోచుకున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. బుధవారం ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘బీజేపీ దోచుకున్న డబ్బుతో 100 ఎయిమ్స్ దవాఖానలు, 30 వేల స్మార్ట్ క్లాస్రూమ్లు, 30 లక్షల పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వవచ్చు. అలా చేస్తే మీ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అభివృద్ధితో సంబంధం లేని కొత్త సమస్యలను లేవనెత్తుతున్నారు’ అని మండిపడ్డారు.