న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు లోక్సభ, 29 అసెంబ్లీ సీట్ల ఫలితాలను రౌండ్ల వారిగా రిలీజ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీజేపీ లీడింగ్లో ఉండగా, కాంగ్రెస్ 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. కార్గిల్ యుద్ధ వీరుడు బ్రిగేడియర్ కుషాల్ థాకూర్.. ఆ పార్టీ తరపున రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ పోటీ చేశారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా లోక్సభ సీటులోనూ బీజేపీ అభ్యర్తి జ్ఞానేశ్వర్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అస్సాంలో అయిదు స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. మూడు సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక మరో రెండు చోట్ల బీజేపీకి మద్దతు ఇచ్చిన యూపీపీఎల్ పార్టీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఇక మేఘలయాలో మాజీ ఫుట్బాల్ ప్లేయర్ యూజెనిసన్ లింగ్డో లీడింగ్లో ఉన్నారు.
బెంగాల్లోని నాలుగు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దిన్హతా, సంతిపుర్ నియోజకవర్గాల్లో ఒకప్పుడు బీజేపీవి. ఇప్పుడు ఆ రెండు స్థానాల్లోనూ తృణమూల్ లీడింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.