పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హాఫ్ మార్క్ దాటేసింది. 40 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో.. ఇప్పటికే బీజేపీ 21 స్థానాల్లో లీడింగ్లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తోస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉంది. పంజాబ్లో దుమ్మురేపిన ఆమ్ ఆద్మీ.. గోవాలో తన సత్తా చాటలేకపోయింది. అనూహ్యంగా తృణమూల్ 4 సీట్లలో ఆధిక్యంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం బీజేపీ వైపే అనుకూలంగా ఉన్నాయి.