లక్నో : యూపీలోని మీరట్లో తన నివాసంలో గణేష్ విగ్రహం పెట్టినందుకు ముస్లిం మత పెద్దల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని బీజేపీ నేత రూబీ ఖాన్ చెప్పారు. రామాలయ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగిన సమయంలో తన ఇంట్లో పూజలు చేసిన సందర్భంలోనూ తనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారని ఆమె వెల్లడించారు.
తన ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించామని ఏడు రోజుల అనంతరం విగ్రహ నిమజ్జనం చేస్తామని రూబీ ఖాన్ చె్శారు. ముస్లిం మత పెద్దలు తనపై ఆగ్రహంతో ఉన్నారని, వీరు తనను చంపాలని చూస్తున్నారని ఆమె వెల్లడించారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని అయినా తాను భయపడబోనని, గణేష్ నిమజ్జనం చేస్తానని..తన భర్త తన వెన్నంటి ఉన్నారని రూబీ ఖాన్ చెప్పుకొచ్చారు. గతంలోనూ తనను టార్గెట్ చేశారని, అయినా తాను వెనక్కి తగ్గనని భర్త సహకారంతో పద్ధతులను పాటిస్తూ గణేష్ విగ్రహ నిమజ్జనం పూర్తిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.