ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
లక్నో, మార్చి 14: బీజేపీ మోసపూరిత విధానాలతో స్వచ్ఛమైన రాజకీయాలు దెబ్బతింటున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సోమవారం విమర్శించారు. బీజేపీ ‘భయపెట్టడం, గందరగోళంలో పడేయడం’ విధానం వల్ల యూపీ ప్రజలు బాధితులుగా మారారని అన్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజల కోసం అసెంబ్లీ లోపలా, బయట తమ పార్టీ గళమెత్తుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.